గత కొన్ని రోజుల నుంచి కాకినాడ మేయర్ వ్యవహారం సంచలనంగా మారింది. కార్పోరేషన్ ను ఎలా అయినా సరే సొంతం చేసుకోవాలని వైసీపీ నేతలు పట్టుదలగా వ్యవహరించడం దాన్ని మేయర్ సుంకర పావని బలంగా అడ్డుకోవడం జరుగుతుంది. అయితే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి పావని లేఖ రాసారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి నుంచి నాకు రక్షణ కల్పించండి అని ఆమె కోరారు.

నా ఇంటిచుట్టు కొందరు ఆకతాయిలు చేతులు ఊపుతూ బెదిరిస్తున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన మనుషులతో బెదిరిస్తూ నన్ను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు. జిల్లా ఎస్పీకి కాకినాడ టీడీపీ మేయర్ పావని లేఖ రాసారు. కాకినాడ నగర ప్రధమ పౌరురాలైనా తనకే ఇలా ఉంటే ఇక్కడ ప్రజలకు భద్రత ఇంకెక్కడిదని ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap