రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో తెలంగాణ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. సంజయ్ తన పాదయాత్ర లో భాగంగా గంభీరావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ...డిజిపి.. మా కార్యకర్తల జోలికి రావొద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పోలీసులు .. మమ్మల్ని వేధిస్తే ఊరుకోమంటూ సంజయ్ వ్యాఖ్యానించారు.

నాలుగు వర్షం చినుకులకే .. సిరిసిల్ల మునిగింది.. ఇదేనా కేటీఆర్ అభివృద్ధి అని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవించడానికే తెలంగాణ వచ్చిందా...? అంటూ సంజయ్ నిలదీశారు. బీజేపీకి వస్తున్న ఆదరణ ఓర్వలేకనే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందంటూ బండి సంజయ్ అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేస్తున్నారో చెప్పాలని కేసీఆర్ ను సంజయ్ ప్రశ్నించారు. దళిత బంధు సిరిసిల్లలో ఎందుకు ఇవ్వడం లేదు..? అంటూ సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: