భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు జో బిడెన్ మరియు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సమావేశమయ్యారు, ప్రధాని మోడీ గురువారం హారిస్‌ను కలిశారని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం గురించి చర్చించారని హారిస్ స్వయంగా పేర్కొన్నారు . దీనితో పాటు, ప్రజాస్వామ్యం, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇండో-పసిఫిక్ వంటి అంశాలు ముఖ్యమైన ప్రపంచవ్యాప్త ఉమ్మడి సమస్యలు కూడా చర్చించబడ్డాయని అంటున్నారు,  ఉగ్రవాద సమస్య వచ్చినప్పుడు, హారిస్ స్వయంగా ఇందులో పాకిస్థాన్ పాత్ర గురించి ప్రస్తావించారని విదేశాంగ కార్యదర్శి హర్ష్ శ్రింగ్లా చెప్పారు. ఇక మోడీ కూడా ''ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ని కలిసినందుకు సంతోషంగా ఉంది, ఆమె ఘనత ప్రపంచం మొత్తానికి స్ఫూర్తినిచ్చింది. భాగస్వామ్య విలువలు మరియు సాంస్కృతిక సంబంధాల పై ఆధారపడిన ఇండియా-USA స్నేహాన్ని మరింత పటిష్టం చేసే బహుళ విషయాల గురించి మేము మాట్లాడాము'' అని తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: