జిల్లాలోని కాగజ్ నగర్ మండలం విలేజ్ 9 అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే పులి దాడిలో ఆవు మృతిచెందింది. పెంచికల్ పేట మండలం ఎల్లూరు అటవీ ప్రాంతంలో పశువుల మందపై పులి దాడి చేయడంతో ఎద్దుకు గాయాలైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. బెజ్జూరు మండలం  కుంటల మానేపల్లి అటవీ ప్రాంతంలో మరో పులి గ్రామస్తుల కంటప‌డ‌టంతో వారంతా భయాందోళనకు గురవుతున్నారు. ఎన్ని పుల‌లు సంచ‌రిస్తున్నాయ‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆయా గ్రామాల‌వారు చెబుతున్న‌ట్లు మూడు నుంచి నాలుగు పులులు జ‌న‌సంచారంలోకి వ‌చ్చాయంటున్నారు. దీనిపై అట‌వీశాఖాధికారులు గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. పులి అడుగు జాడ‌ల‌ను బ‌ట్టి వాటిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ప‌శువుల మంద‌పై దాడిచేసిన స‌మ‌యంలో మ‌నుషులెవ‌రూ లేర‌ని, మ‌ధ్యాహ్న స‌మ‌యంల కావ‌డంతో భోజ‌నానికి వెళ్లార‌ని, లేదంటే ప‌శువుల కాప‌ర్లు కూడా పులిబారిన పడేవార‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: