ఏపీ రాష్ట్ర హోం మంత్రి సుచరిత రాష్ట్రం మొత్తానికి హోం మంత్రా?..లేక లేక అధికార పార్టీకి మాత్రమే హోం మంత్రా అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. నిన్న కొప్పర్రు గ్రామంలో వైసీపీకి చెందిన బాధితులను మాత్రమే పరామర్శించారుకానీ అసలు బాధితులను పరామర్శించలేదన్నారు. వారంతా టీడీపీ వర్గం వారన్నారు. టీడీపీ వర్గీయుల ఇల్లు, మోటార్ సైకిళ్ళు కూడా తగల బెట్టారని, ఇంట్లో సోఫాలు తగలబెట్టారని, ఇంటి మీద రాళ్లదాడి చేశారని వర్ల రామయ్య తెలిపారు. ఈ విషయాలన్నీ సుచరితకు తెలియవా? అని ప్రశ్నించారు. పోలీసులు కూడా భయపడి టీడీపీ వారి ఇంట్లో దాక్కున్నారని, వీరెవరినీ పరామర్శించకుండా, అధికార పార్టీ వారి చేతిలో గాయపడిన పోలీసులను కూడా పరామర్శించకుండా కేవలం వైసీపీ వర్గీయులను కలవడం దారుణమన్నారు. మానవత్వమంటే ఇదేనా అని ప్రశ్నించారు. హోంమంత్రి సుచరిత తన స్థాయిని అధికార పార్టీకి మాత్రమే పరిమితం చేసుకుంటున్నారని, రాష్ట్ర స్థాయి హోంమంత్రి అనే విషయం మరిచిపోయారన్నారు. ఇకనైనా తాను ఏపీకి హోంమంత్రి అని గుర్తంచుకొని పనిచేయాలని హితవు పలికారు.
ఏపీ రాష్ట్ర హోం మంత్రి సుచరిత రాష్ట్రం మొత్తానికి హోం మంత్రా?..లేక లేక అధికార పార్టీకి మాత్రమే హోం మంత్రా అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. నిన్న కొప్పర్రు గ్రామంలో వైసీపీకి చెందిన బాధితులను మాత్రమే పరామర్శించారుకానీ అసలు బాధితులను పరామర్శించలేదన్నారు. వారంతా టీడీపీ వర్గం వారన్నారు. టీడీపీ వర్గీయుల ఇల్లు, మోటార్ సైకిళ్ళు కూడా తగల బెట్టారని, ఇంట్లో సోఫాలు తగలబెట్టారని, ఇంటి మీద రాళ్లదాడి చేశారని వర్ల రామయ్య తెలిపారు. ఈ విషయాలన్నీ సుచరితకు తెలియవా? అని ప్రశ్నించారు. పోలీసులు కూడా భయపడి టీడీపీ వారి ఇంట్లో దాక్కున్నారని, వీరెవరినీ పరామర్శించకుండా, అధికార పార్టీ వారి చేతిలో గాయపడిన పోలీసులను కూడా పరామర్శించకుండా కేవలం వైసీపీ వర్గీయులను కలవడం దారుణమన్నారు. మానవత్వమంటే ఇదేనా అని ప్రశ్నించారు. హోంమంత్రి సుచరిత తన స్థాయిని అధికార పార్టీకి మాత్రమే పరిమితం చేసుకుంటున్నారని, రాష్ట్ర స్థాయి హోంమంత్రి అనే విషయం మరిచిపోయారన్నారు. ఇకనైనా తాను ఏపీకి హోంమంత్రి అని గుర్తంచుకొని పనిచేయాలని హితవు పలికారు.