భీమవరం ఎంపీపీ ప్రమాణ స్వీకారంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేసారు. భీమవరం నియోజకవర్గంలో గతంలో అన్ని పార్టీల మధ్య సోదర భావం ఉండేది అని అన్నారు ఆయన. ఇటీవల ఒక పార్టీకి చెందిన నాయకులు అన్ని విషయాల్లో గొడవలు పడుతూ సవాలుచేస్తూ ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారు అని మండిపడ్డారు. వీరవాసరంలో జనసేన ర్యాలీ ని అడ్డుకున్నారని దాడి చేశారని అసత్య ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు ఎమ్మెల్యే.

స్థానిక జనసేన నేతలు ఆ పార్టీ అధినేతకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారు అని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి అని ఆయన హితవు పలికారు. ఇది సినిమా కాదు  జీవితం ప్రజాసేవలో అన్నదమ్ములుగా అన్ని పార్టీల నాయకులు కలిసి ఉండాలి అని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp