జూబ్లిహిల్స్ లో భారీ చోరీ జ‌రిగింది. ఓ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారిని అత‌డి వ‌ద్ద ప‌నిచేస్తున్న డ్రైవ‌ర్ దారుణంగా మోసం చేశాడు. డ‌బ్బులు ఓ వ్య‌క్తికి ఇవ్వ‌మ‌ని పంపిస్తే అవి తీసుకుని ఉడాయించాడు డ్రైవ‌ర్. రియల్ ఎస్టేట్  వ్యాపారి నుండి అత‌డి వ‌ద్ద డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తున్న వ్య‌క్తి రూ.55 లక్షలతో ఉడాయించాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10సీ లో ఈ చోరీ జ‌రిగింది. తెలిసిన వారికి డబ్బు ఇవ్వాలని య‌జ‌మాని డ్రైవ‌ర్ శ్రీనివాస్ తో పంపించాడు. 

కానీ డబ్బు మ‌రియు కారుతో పరార్ అవ్వ‌డంతో య‌జ‌మాని షాక్ అయ్య‌డు. డ్రైవ‌ర్ శ్రీనివాస్ డ‌బ్బులు తీసుకువెళ్లిన త‌ర‌వాత సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేయ‌డంతో య‌జ‌మానికి అనుమానం వ‌చ్చింది. దాంతో రియల్టర్ య‌జ‌మాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి విచార‌ణ ప్రారంభించారు. ప్రత్యేక బృందాలతో పోలీసులు డ్రైవర్ శ్రీనివాస్ కోసం గాలింపు చ‌ర్య‌లు చేపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: