ప‌వ‌న్‌క‌ల్యాణ్ పై మ‌ళ్లీ ఎదురుదాడికి ఏపీ మంత్రులు సిద్ధ‌మ‌వుతున్నారు. అక్టోబ‌రు రెండోతేదీన శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మానికి ఆయ‌న పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఆయ‌న సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు. సెప్టెంబ‌రు ఐదోతేదీన రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌న‌సేన నాయ‌కులు రోడ్ల‌పై ఉండే గుంత‌ల‌ను పూడ్చే కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. తాజాగా సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రులు ఎదురుదాడి చేశారు. మ‌రోసారి వారంతా ఎదురుదాడికి సిద్ధ‌మ‌వుతున్నారు. మంత్రుల‌కు ప‌వ‌న్ గట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న‌వారి నుంచి మాత్రం మ‌ద్ద‌తు రాలేదు. పోసాని వ్యాఖ్య‌ల‌పై కూడా ప‌వ‌న్ గోంకారాలంటూ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి మ‌రోసారి ఏపీలో ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మంత్రులు ఆయ‌న‌పై విరుచుకుప‌డ‌బోతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి బాగానే ఉంద‌ని, ర‌హ‌దారుల‌న్నీ బాగానే ఉన్నాయ‌ని, కేవ‌లం ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికే ప‌వ‌న్ ఈ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చార‌ని ఆరోపించ‌బోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: