మాలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ స్పందించారు. మాలోని మొత్తం వ్య‌వ‌హారం చూస్తోంటే స‌ర్క‌స్‌ను త‌లపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు వ‌ర్మ‌చేసిన వ్యాఖ్య‌ల‌పైనే చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్ప‌టికే మా అధ్యక్ష ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసిన‌ప్ప‌టికీ  ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య మాట‌ల యుద్ధం చ‌ల్లార‌లేదు. ఇప్ప‌టికి కూడా ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూనే ఉన్నారు. రావ‌ణ‌కాష్టంలా విష్ణు, ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్స్ మ‌ధ్య పోరు న‌డుస్తూనే ఉంది. ప్ర‌కాష్ రాజ్ కోర్టుకు వెళ్లే యోచ‌న‌లో ఉన్నారు. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడుతూ స్వ‌తంత్ర భావాలున్న ప్ర‌కాష్ రాజ్ లాంటి వ్య‌క్తి అస‌లు మా అధ్య‌క్ష ప‌ద‌విని ఎందుకు కోరుకున్నారో? అందుకు ఆయ‌న‌కు ప్రేర‌ణ ఏంటో ఆయనే చెప్పాలి. సీసీటీవీ పుటేజ్ కోసం ర‌గ‌డ జ‌రుగుతోంది. త‌న ప్యానెల్ త‌ర‌ఫున పోటీచేసిన‌వారిపై మోహ‌న్‌బాబు చేయి చేసుకున్నార‌ని, ఆ ఫుటేజ్ కావాలంటూ కోరుతున్నారు. ఇస్తాన‌ని ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహ‌న్ తెలిపారు. ఈ పుటేజ్ ఆధారంగా ఆయ‌న కోర్టుకు వెళ‌తార‌ని భావిస్తున్నారు. ఇవ‌న్నీ చూసూ రామ్ గోపాల్‌వ‌ర్మ స‌ర్క‌స్‌లా ఉంది అంటూ వ్యాఖ్యానించివుంటార‌ని సినీ అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa