టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో విద్యుత్ కోతలు చాలా వరకు తక్కువగానే ఉండేవి. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడానికి తెలుగుదేశం పార్టీ సిద్దమవుతుంది అనే వార్తలు వినపడుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న కొన్ని పనుల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందని వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించి దాదాపుగా వారి వారి నియోజకవర్గాల్లో అలాగే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా నియోజకవర్గాల్లో కరెంటు దీక్షలను చేయించే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పార్టీ అనుబంధ సంఘాలకు కూడా చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: