మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగి వారం రోజులు గ‌డిచినా టాలివుడ్‌లో రచ్చ మాత్రం ఆగ‌డం లేదు. మంచు విష్ణు ప్యానెల్ ఎన్నిక‌ల‌లో ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని, అందుకు ఎన్నిక‌ల అధికారులు సైతం స‌హ‌క‌రించార‌ని ప్ర‌కాశ్‌రాజ్, అత‌ని వ‌ర్గం పేర్కొన్న‌ది. ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌రేష్‌, మంచు విష్ణులు ప్ర‌త్య‌ర్థి ప్యాన‌ల్ న‌టుల‌పై దాడికి పాల్ప‌డ్డార‌ని  ఆరోపణ‌లు చేశారు ప్ర‌కాశ్‌రాజ్‌.

సీసీ పుటేజీలో అన్ని రికార్డు అయ్యాయ‌ని.. ఆ సీసీ పుటేజీ ఇవ్వాల‌ని ఎన్నిక‌ల అధికారిని కోరారు ప్ర‌కాశ్‌రాజ్. కానీ సీసీ పుటేజీ ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. మా ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆదివారం ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ వ్య‌వ‌హారంపై పోలీసులు జోక్యం చేసుకున్నారు. మా ఎన్నిక‌ల‌కు సంబంధించిన సీసీ పుటేజీని పోలీసులు సీజ్ చేశారు.  పోలింగ్ నిర్వ‌హించిన జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూల్‌లో సీసీ పుటేజీకి సంబంధించిన స‌ర్వ‌ర్ రూమ్‌కు తాళం వేశారు పోలీసులు. ఇటీవ‌ల ప్ర‌కాశ్‌రాజ్ మంచువిష్ణు వ‌ర్గంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన త‌తంగం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింద‌ని, సీసీ పుటేజీల‌ను మాయం చేస్తార‌నే అనుమానంతోనే ప్ర‌కాశ్‌ ఫిర్యాదు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: