ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు కార్యక్రమాలను చేపట్టి ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంక్షోభం విషయంలో సమర్థవంతంగా వ్యవహరించడం పట్ల పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ గానే రాష్ట్ర ప్రభుత్వంను ఇబ్బంది పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రైతుల తరపున పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారని ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ఆక్వా రైతులకు అండగా నిలబడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లి అక్కడి రైతుల తో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులతో కూడా సమావేశం నిర్వహించి ఆక్వా రైతులకు అండగా నిలబడే విధంగా పలు కార్యక్రమాలను స్పీడ్ గా చేయడానికి రెడీ అవుతున్నారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: