యాదాద్రి క్షేత్ర పర్యటనకు సీఎం కేసీఆర్ నేపధ్యంలో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు. ఆలయ ఉద్ఘాటన , మహా సుదర్శన యాగం నిర్వహణ తేదీ వివరాలను ప్రకటించనున్నారు ఆయన. 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి యాదాద్రి పుణ్యక్షేత్రం పర్యటనకు వెళ్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని మరోసారి సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు అని అధికారులు వివరించారు.

యాదాద్రి పున:ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామివారు నిర్ణయించి వున్నారు అని వివరించారు. యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటిస్తారు అని పేర్కొన్నారు. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను,తేదీలను కూడా ఇవ్వాళ  సిఎం కెసిఆర్ ప్రకటించనున్నారు అని తెలిపారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రాచకొండ కమీషనరేట్ పోలీసులు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr