తెలంగాణా ఆర్టీసిని ఎలా అయినా సరే లాభాల బాటలో నడపాలని ఆర్టీసీ నూతన ఎండీ సజ్జనార్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గాడిలో పెట్టడానికి పలు సంచలన నిర్ణయాల దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఎండీ సజ్జనార్ మార్క్ నిర్ణయం ఇప్పుడు బాగా హైలెట్ అవుతుంది. బస్టాండులో అధిక ధరలకు అమ్మితే వ్యాపారులపై జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

జేబీఎస్- ఎంజిబిఎస్ తో పాటు జిల్లాలోని బస్ స్టాండ్స్ లలో తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తోన్న అధికారులు... మార్పి ధరల కంటే ఎక్కువ వసూళ్లు చేస్తోన్న షాప్స్ కు నోటీసులు ఇస్తున్నారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా భారీ జరిమానాలు విధిస్తూ షాక్ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు షాప్స్ కి జరిమానా విధించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు... తీరు మారకపోతే లైసెన్స్ లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts