పోరుమామిళ్లలొ దళితుల ఆత్మీయ సమావేశంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సిఎం వైఎస్ జగన్ దళిత వర్గాల అభ్యన్నతి కోసం ప్రత్యేక దృష్టి పెట్టారు అని పేర్కొన్నారు. సిఎం వైఎస్ జగన్ దళితుల పక్షపాతి అని తెలిపారు. దళిత వర్గాలు ఉన్నత చదువులు చదవాలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారు అని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

కరెంట్ కోతలని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని రోజుకు ఒకసారి పెట్రో, గ్యాస్ ధరలు పెంచుతున్నారు అంటూ మండిపడ్డారు. ఆదినారాయణ రెడ్డి గతంలో దళితులపై అవహేళన గా మాట్లాడారు అన్నారు. 2014 లో వైసిపి బి ఫారం పైన గెలిచి అధికారం, మంత్రి పదవి కోసం టీడీపీలో చేరాడు అని విమర్శించారు. ఇలాంటి నీచులకు , దోషులకు ప్రజలు తగినబుద్ది చెప్పాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: