తెలంగాణాలో వైఎస్ షర్మిల రాజకీయంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కోసం తీవ్రంగా కష్టపడుతూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి రావడానికి రెడీ అయ్యారు. తెలంగాణా మొత్తం పాదయాత్ర చేయడానికి షర్మిల సిద్దం అవుతున్నారు. ఇక ఇప్పుడు ఆమె కడప జిల్లా వెళ్లి తన తండ్రికి నివాళులు అర్పించారు. ఇడుపులపాయలో దివంగత మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద కన్నీరు పెట్టుకున్నారు.

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, వైఎస్ విజయమ్మ నివాళి అర్పించారు. రేపటి నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించబోయేముందు  తండ్రి ఆశీస్సులు తీసుకున్న షర్మిల.. కన్నీరు పెట్టుకున్నారు అక్కడ. ఆమెతో పాటు నివాళులు అర్పించిన వారిలో వైఎస్సార్ టీపీ తెలంగాణ నేతలు వైఎస్ కుటుంబ అభిమానులు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: