ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి సాగుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార  ప్రతినిధి పట్టాభిరాం చేస్తున్న వ్యాఖ్యలు... ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసం పై నేడు వైసిపి నాయకులు దాడులకు దిగడం సంచలనంగా మారింది. ఆయన నివాసం పై దాడులకు దిగడం ఇదే కాకుండా రాళ్లు రువ్వారు వైసీపీ కార్యకర్తలు.

 ఈ దాడిలో పలువురికి గాయాలు అయినట్లు గా కూడా తెలుస్తోంది. దాడిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత మంది కార్యకర్తలు పోలీసుల పై విమర్శలకు దిగారు. కార్యకర్త పోలీసుల తీరును నిరసిస్తూ లారీ కింద తలపెట్టడం గమనార్హం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకులు కార్యకర్తలు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు దిగారు.ఈ దాడికి సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ కు ఫోన్ చేసి జరిగిన ఘటనపై వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: