ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ నేతలు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఇక దీనికి సంబంధించి ఏపీ డీజీపీ కార్యాలయం ప్రజలను హెచ్చరించింది. రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయనం పాటించండి అని విజ్ఞప్తి చేసింది.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన  వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దు, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని డీజీపీ కార్యాలయం పేర్కొంది. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించాం అని అన్నారు డీజీపీ. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో  సంయనం పాటిస్తూ సహకరించాలి అని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: