నన్ను ఎంతగా బాధపెట్టినా నిగ్రహించుకుంటున్నా: చంద్రబాబు
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో హుందాతనం గురించి ఒకరు నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తనకు రాలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు అధికార వైసీపీ వారు వ్యవహరిస్తున్న తీరుపై తనకు ఆవేశం, బాధ, కోపం, తపన ఉందని, అయినా వాటన్నింటినీ నిగ్రహించుకున్నాను ఆయన అన్నారు. తన నిగ్రహాన్ని అలుసుగా తీసుకొని వైసీపీ వారు రెచ్చిపోతున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని చంద్రబాబు హితవు పలికారు. తాను సహనం కోల్పోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టదనీ, అయినా బాధ్యత రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. తన మనో ధైర్యాన్ని, నిబ్బరంను దెబ్బతీయాలని వైసీపీ చూస్తోందని, అది ఆ పార్టీ వారి ఎన్నటికీ కాని పని చంద్రబాబు తేల్చిచెప్పారు. వైసీపీ అరాచకాలను అందరూ ఖండించాల్సిన అవసరముందని ఆయన అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: