ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య అగ్గివేస్తే భ‌గ్గుమ‌న్న‌ట్టు రాజ‌కీయం కొనసాగుతున్న‌ది. ఒక‌రికొక‌రు దూషించుకుంటున్నారు. అంత‌టితో ఆగ‌కుండా పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు చేస్తున్నారు. పార్టీ కార్యాల‌యాల నుంచి ఇంటిదాక దాడులు చేసుకునే ప‌రిస్థితి దాపురించిన‌ది. తాజాగా గుంటూరులో టీడీపీ జెండాలు త‌గుల‌పెట్టారు వైసీపీ నేత‌లు. చంద్ర‌బాబునాయుడు పై విమ‌ర్శ‌లు  చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా.. చంద్ర‌బాబు రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తున్నారంటూ బోత్స పేర్కొంటున్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు ఉన్మాదిలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.  చంద్ర‌బాబు కావాల‌నే రెచ్చ‌గొడుతున్నారు అని వైసీపీ నేత‌లు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్క‌డ ఇక్క‌డ అని తేడా లేకుండా వైసీపీ నేత‌లు నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు. కృష్ణాజిల్లా పామూరు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తిపురంలో వైసీపీ నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించారు. చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాలి, ప‌ట్టాబి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని వైసీపీ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు.   టీడీపీ కార్యాల‌యాల‌పై చేస్తున్న దాడుల‌కు నిర‌స‌న‌గా బంద్ చేప‌ట్టాల‌ని టీడీపీ ప్ర‌క‌టిస్తే.. అందుకు భిన్నంగా వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఏపీ  రాజకీయ రగ‌డ ఎప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగుతుందో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: