అభివృద్ధిని ఓర్వ‌లేక‌నే ప్ర‌తిప‌క్ష నాయ‌కులు రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తారు. బుధ‌వారం తాడేప‌ల్లిలో నిర్వ‌హించిన‌  జ‌గ‌న‌న్న తోడు కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు.  తాడేప‌ల్లిలో విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. ఇప్పుడున్న ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు దారుణ‌మైన బూతులు తిడుతారు. ఆ బూతులు తిట్టార‌ని.. త‌న‌ను అభిమానించేవారు, ఆప్యాయించే వారు రియాక్ష‌న్ చూపిస్తుంటారు. కావాల‌ని రాజ‌కీయంగా ల‌బ్దిపొందాల‌ని చూస్తున్నారు.

 పేద‌వాడికి మంచి చేయాల‌ని చూస్తే మంచి జ‌రుగ‌కుండా అడ్డుకుంటారు. వ‌క్రీక‌ర‌ణ వార్త‌లు టీవీల‌లో పేప‌ర్ల‌లో రాస్తుంటారు. పేద‌ల‌కు మేలు జ‌రిగితే ఎక్క‌డ సీఎం జ‌గ‌న్‌కు పేరు వ‌స్తుందో అని అందుకు ఆటంకాల‌ను సృష్టిస్తున్నారు. మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టే ప్ర‌యత్నాలు చేస్తున్నారు. అబ‌ద్దాలు, అస‌త్యాలు, మోసం చేసే బుద్ది వారికి ఉంటుంది. అన్యాయంగా బూతులు తిడుతుంటారు. బూతులు తిట్టార‌ని ఎవ‌రైనా ఆగ్ర‌హానికి గురై ప్ర‌శ్నిస్తే  రియాక్షన్ మొద‌ల‌వుతుంది. కుల‌, మ‌తాల మ‌ధ్య చిచ్చు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: