దేవినేని కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి ఆ పార్టీ నేత దేవినేని చందు... విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్, తన సోదరుడు దేవినేని అవినాష్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. అవినాష్ నువ్వు దేవినేని కుటుంబం పరువు తీశారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ ఈ కుటుంబం కు రాజకీయ భిక్ష పెట్టారన్నారు చందు.

దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ పై మీ మిత్రబృందాన్ని పంపావని నారా లోకేష్ నిన్ను తమ్ముడు అని సంభోదించాడు అంటూ వ్యాఖ్యలు చేసారు. నీ స్వలాభం కోసం ఎంతమంది ప్రాణాలు తీస్తావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. నీకు కావాల్సింది అధికార దాహం ఒక్కటే అని రాష్ట్ర తెలుగు యువత పదవి ఇచ్చారు అని నీకు గుడివాడ సీట్ ఇస్తే అదికూడా మార్చి పోయావు అంటూ తీవ్ర విమర్శలు చేసారు. అవినాష్ ఈ సంఘటన తో నీ రాజకీయ భవిష్యత్తు శున్యం గా కనిపిస్తుంది అంటూ మండిపడ్డారు. దేవినేని అవినాష్ మిత్రాబృందం ఇక్కడ కనపడ్డారు అని ప్రత్యక్ష  సాక్షులు చెపుతున్నారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: