గిట్ట‌నివాడు అధికారం చేప‌ట్టాడ‌నే అక్క‌సుతో కొంత‌మంది కులాల మ‌ధ్య చిచ్చు పెడుతున్నార‌ని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆరోపించారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన పోలీసు అమ‌రివీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. పోలీసుల‌కు త‌మ ప్ర‌భుత్వం మొద‌టిసారిగా వారంతపు సెల‌వును ప్ర‌క‌టించింద‌ని, హోంగార్డుల‌కు గౌర‌వ వేత‌నాన్ని పెంచింద‌ని గుర్తుచేశారు. అధికారం ద‌క్క‌లేద‌నే అక్క‌సుతో రాష్ట్రంలో చిన్న‌పిల్ల‌లు మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిసలైన‌ట్లుగా, వాటిని కావాల‌నే బ‌ల‌వంతంగా అల‌వాటు చేస్తున్న‌ట్లుగా ప్ర‌చారం చేస్తున్నార‌ని, చీకట్లో ఆల‌యాల‌కు సంబంధించిన ర‌థాల‌ను త‌గ‌ల‌బెట్టి ప్ర‌జ‌ల మ‌ధ్య భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. ముఖ్య‌మంత్రిపై అస‌భ్య ప‌ద‌జాలాన్ని ఉప‌యోగిస్తున్నార‌ని, వాళ్లు గెల‌వ‌లేద‌ని, గెలిచిన‌వారిని ఇబ్బంది పెడుతున్నార‌ని, రాష్ట్రం ప‌రువు తీసేందుకు వెన‌కాడ‌టంలేద‌న్నారు. వారికి గిట్ట‌నివాడు ప‌రిపాల‌న చేస్తుంటే ఓర్వ‌లేక‌పోతున్నార‌న్నారు. మాద‌క ద్ర‌వ్యాల‌కు సంబంధించి కేంద్రం, డీఆర్ ఐ, విజ‌య‌వాడ సీపీ, డీజీపీ చెప్పినా వినిపించుకోకుండా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: