తెలంగాణాలో అధికారం కోసం తీవ్రంగా కష్టపడుతున్న వైఎస్ షర్మిల నిన్నటి నుంచి పాధయాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేయడానికి సిద్దం అయ్యారు. గతంలో పాదయాత్ర చేసిన అనుభవం తో ఈసారి మరింత పట్టుదలగా ముందుకు వెళ్తున్నారు షర్మిల. ఎలా అయినా సరే సిఎం కేసీఆర్ ను గద్దె దించాలి అనే పట్టుదలతో షర్మిల ఉండటం గమనార్హం.

ఇక రెండో రోజు పాదయాత్ర మొదలయింది. రెండో రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రను కందవాడ నుంచి మొదలు పెట్టారు వైఎస్ షర్మిల. నేటి యాత్రలో కందవాడ, నక్కల పల్లి, కేతిరెడ్డిపల్లి క్రాస్, వెంకటాపూర్, కవ్వడిగూడ, మల్కాపురం, అందాపూర్, నావాజ్పూర్ క్రాస్, కాచారం క్రాస్ వరకు పాదయాత్ర  సాగుతుంది. వెంకటాపూర్ లో లంచ్ బ్రేక్, కాచారం క్రాస్ దగ్గర రాత్రి బస చేయనున్న షర్మిల... రేపు అక్కడి నుంచి యాత్ర మొదలుపెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts