1959 భారత్, చైనా సరిహద్దుల్లో దేశ భద్రత కు ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులకు నివాళులు అర్పిస్తూ అక్టోబర్ 21 తేదీన అమరవీరుల దినోత్సవం జరువుకుంటున్నాం అన్నారు తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి. విధి నిర్వహణలో 377 మంది ప్రాణాలు కోల్పోయారు , అమర వీరులకు ఆయన నివాళులు అర్పించారు. పోలీసులు... టెర్రరిజం, నక్సలిజం ను అరికట్టడం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు అని వివరించారు.

టెక్నాలజీ ఉపయోగించి శాంతి భద్రతలను కాపాడుతున్నాం అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షలు సీసీ కెమెరాలు అవసరం ఉంది అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.25 సీసీ కెమెరాలు ఉండగా హైదరాబాద్ లో ని మూడు కమిషనరేట్ పరిధిలో దాదాపు 7లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కాపాడుతున్నాం అని వివరించారు. పోలీస్ సంక్షేమమే ప్రధాన అజెండా గా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts