రాజోలు జనగ్రహ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెదేపా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. నీకు సభ్యత ఉందా, నువ్వు బుద్ది తెచ్చుకుని మాట్లాడు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. నువ్వు బయటకి వస్తే నిన్నూ తన్నే పరిస్థితి ఉంది అని ఆయన హెచ్చరించారు. ఇటువంటి మాటలు మాట్లాడే ముందూ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని సూచించారు.

ఈ జనగ్రహా దీక్షను తట్టుకునే శక్తి మీకు లేదు అంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పై ఆయన వ్యాఖ్యలు చేసారు. జనం అంతా జగన్ మోహన్ రెడ్డి వైపూ ఉన్నారు అని పేర్కొన్నారు. ఉనికి కోసమే మీరు మాట్లాడుతున్నారు తప్ప మీరు జనాల మనస్సులో  లేరు, జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారని రాపాక వరప్రసాదరావు ఆయనను హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: