ఈ మ‌ధ్య కాలంలో పేలుడు ఘ‌ట‌న‌లు త‌రుచూ ఏదో ఒక చోట చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావెన్స్‌లో షెన్‌యాంగ్ వ‌ద్ద ఉన్న ఓ రెస్టారెంట్‌లో భారీ పేలుడు చోటు చేసుకున్న‌ది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు. దాదాపు 33 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారని అక్క‌డి అధికారులు మీడియాకు వెల్ల‌డించారు. ఈసంఘ‌ట‌న‌పై స‌మాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన దాదాపు 30 ఫైర్ ఇంజ‌న్ల‌తో మంట‌ల‌ను ఆర్పేందుకు ప్ర‌య‌త్నం చేశారు. కొద్దిసేప‌టి త‌రువాత అదుపులోకి తీసుకొచ్చారు.  

మూడు అంత‌స్తులు ఉన్న భ‌వ‌నం ఒక్క‌సారిగా పేలుడు సంభ‌వించ‌డంతో కుప్ప‌కూలింది. చుట్టుప‌క్క‌ల పార్కింగ్ చేసిన వాహ‌నాలు కూడ ధ్వంస‌మ‌య్యాయి. రెస్టారెంట్‌కు స‌మీపంలో ఉన్న భ‌వ‌నాలు దెబ్బ‌తిన్నాయి. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన‌ చికిత్స అందించేందుకు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  అందులో ఉన్న శిథిలాలు తొల‌గించారు. అధికారులు ప్ర‌మాదం ఏ కార‌ణం వ‌ల్ల సంభ‌వించింద‌ని ద‌ర్య‌ప్తును ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: