ఒకేసారి భూమి రెండు మూడు సెకన్లపాటు కంపించడంతో ఎవరికీ ఏమి అర్థం కాలేదు. జనాలందరూ పరుగులు పెట్టారు. చాలా భయపడ్డాం. దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి దాపురించింది అంటున్నారు అక్కడి ప్రాంత వాసులు. మధ్యాహ్నం సమయంలో కంపించిన దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైనట్టు అధికారులు ధృవీకరించారు. తెలంగాణలో భూకంపాల వలన ఆస్తి, ప్రాణనష్టం జరగకపోయినా వరుస ప్రకంపనల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో సుమారు మూడు నాలుగు నెలల కింద నల్లగొండ, నాగర్కర్నూలు జిల్లాలలో కూడ భూమి కంపించడంతో జనాలు భయాందోళనకు చెందిన విధితమే. తాజాగా కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో ఈ పరిస్థితి నెలకొనడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
ఒకేసారి భూమి రెండు మూడు సెకన్లపాటు కంపించడంతో ఎవరికీ ఏమి అర్థం కాలేదు. జనాలందరూ పరుగులు పెట్టారు. చాలా భయపడ్డాం. దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి దాపురించింది అంటున్నారు అక్కడి ప్రాంత వాసులు. మధ్యాహ్నం సమయంలో కంపించిన దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైనట్టు అధికారులు ధృవీకరించారు. తెలంగాణలో భూకంపాల వలన ఆస్తి, ప్రాణనష్టం జరగకపోయినా వరుస ప్రకంపనల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో సుమారు మూడు నాలుగు నెలల కింద నల్లగొండ, నాగర్కర్నూలు జిల్లాలలో కూడ భూమి కంపించడంతో జనాలు భయాందోళనకు చెందిన విధితమే. తాజాగా కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో ఈ పరిస్థితి నెలకొనడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.