తాజాగా పట్టాభికి బెయిల్ మంజూరు చేసే సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు వైపుల నుంచి లాయర్లు తమ వాదనలు వినిపించారు. పట్టాభి చేసిన విమర్శల సీడీని కోర్టుకు న్యాయవాదులు సమర్పించారు. రూల్ ఆఫ్ లా పాటించాలని కోర్టు వ్యాఖ్యానించింది. 41 సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎందుకు అరెస్ట్ చేశారని ఏపీ పోలీసులపై హై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పోలీసులు కాస్త దూకుడు తగ్గించుకోవాలని సూచించింది. ఎలా పడితే అలా ప్రొసిజర్ లేకుండా చేస్తారా అని జడ్జీ పోలీసులపై గరం అయ్యారు. థర్డ్ క్లాస్ మేజిస్ట్రేట్ రిమాండ్ ఎలా ఇచ్చారో చెప్పాలని హైకోర్టు వివరణ కోరింది. గత బుధవారం పోలీసులు పట్టాభిని అరెస్టు చేయగా.. తాజాగా షరతులతో కూడిన బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది.
తాజాగా పట్టాభికి బెయిల్ మంజూరు చేసే సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు వైపుల నుంచి లాయర్లు తమ వాదనలు వినిపించారు. పట్టాభి చేసిన విమర్శల సీడీని కోర్టుకు న్యాయవాదులు సమర్పించారు. రూల్ ఆఫ్ లా పాటించాలని కోర్టు వ్యాఖ్యానించింది. 41 సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎందుకు అరెస్ట్ చేశారని ఏపీ పోలీసులపై హై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పోలీసులు కాస్త దూకుడు తగ్గించుకోవాలని సూచించింది. ఎలా పడితే అలా ప్రొసిజర్ లేకుండా చేస్తారా అని జడ్జీ పోలీసులపై గరం అయ్యారు. థర్డ్ క్లాస్ మేజిస్ట్రేట్ రిమాండ్ ఎలా ఇచ్చారో చెప్పాలని హైకోర్టు వివరణ కోరింది. గత బుధవారం పోలీసులు పట్టాభిని అరెస్టు చేయగా.. తాజాగా షరతులతో కూడిన బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది.