కథానాయిక తమన్నా భాటియా హోస్ట్గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. రాను రాను షోకి ఆదరణ దక్కకపోవడంతో తమన్నా స్థానంలో నిర్వాహకులు యాంకర్ అనసూయని తీసుకున్నారు. అనసూయ రంగ ప్రవేశంతో ఈ షో మంచి రేటింగ్ సాధిస్తుందనే ఆశాభావంతో ప్రొడక్షన్ హౌస్ ఉన్న సమయంలో వారికి తమన్నా షాకిచ్చింది. తనను తొలగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తమన్నాభాటియా ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీపై తన న్యాయవాదిద్వారా నోటీసులు జారీచేశారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్కు పంపిన నోటీసుల్లో తమన్నా పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమా తమన్నాకు బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత తమన్నా కథానాయికగా దూసుకెళ్లింది. 100 % లవ్, ఊసరవెల్లి, కెమెరామెన్ గంగతో రాంబాబు, రచ్చ, బాహుబాలి లాంటి సినిమాల్లో నటించడంతోపాటు తాజాగా సీటీమార్, మాస్ట్రో సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
కథానాయిక తమన్నా భాటియా హోస్ట్గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. రాను రాను షోకి ఆదరణ దక్కకపోవడంతో తమన్నా స్థానంలో నిర్వాహకులు యాంకర్ అనసూయని తీసుకున్నారు. అనసూయ రంగ ప్రవేశంతో ఈ షో మంచి రేటింగ్ సాధిస్తుందనే ఆశాభావంతో ప్రొడక్షన్ హౌస్ ఉన్న సమయంలో వారికి తమన్నా షాకిచ్చింది. తనను తొలగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తమన్నాభాటియా ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీపై తన న్యాయవాదిద్వారా నోటీసులు జారీచేశారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్కు పంపిన నోటీసుల్లో తమన్నా పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమా తమన్నాకు బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత తమన్నా కథానాయికగా దూసుకెళ్లింది. 100 % లవ్, ఊసరవెల్లి, కెమెరామెన్ గంగతో రాంబాబు, రచ్చ, బాహుబాలి లాంటి సినిమాల్లో నటించడంతోపాటు తాజాగా సీటీమార్, మాస్ట్రో సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.