గత కొన్ని రోజులుగా తెలంగాణాలో మావోల అలజడి పెరుగుతుంది అనే వార్తలు వినపడుతున్నాయి. మావోలు కొందరిని టార్గెట్ చేసారని వారి లక్ష్యంగా వాళ్ళు తెలంగాణా అడవుల్లోకి వచ్చారని ప్రచారం ఉంది. ఇక మావోల విషయంలో తెలంగాణా పోలీసులు పక్కా వ్యూహం తో ముందుకు వెళ్తున్నారు. వారు భారీ దెబ్బ కొట్టే అవకాశం ఉందని మావోల అగ్ర నేతలు వచ్చారని నిఘా వర్గాలు హెచ్చరికలు చేసాయి.

ఇక ఇదిలా ఉంటే చత్తిస్ ఘడ్ తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు తెలంగాణా పోలీసులు. రేపు మావోలు తెలంగాణా బంద్ కు కూడా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల కోసం కుంబింగ్ ములుగు జిల్లాలో కొనసాగుతుంది. హిద్మా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వాహనాలు తనిఖీ చేస్తున్న భద్రతా దళాలు... అతని గురించి చిన్న సమాచారం వచ్చినా వదలడం లేదు. మెరుపు దాడుల్లో అతను దిట్ట.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts