సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. నేను ఎప్పటికీ హిందూ వాదినే.... హిందువుగా పుట్టాను... హిందువుగానే మరణిస్తాను అని ఆయన వివరించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమం లో వైరల్ అవుతున్న సంఘటన చాలా బాధాకరం అని వ్యాఖ్యానించారు. నేను 2017 లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్రైస్తవ సోదరుల ఆహ్వానం మేరకు ఆనాడు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అని తెలిపారు.

టిటిడి బోర్డు సభ్యులు గా ఉన్న నేను ప్రస్తుతం అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సబబు కాదన్నారు ఆయన. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిలలో, మసీదులలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనడం లేదా అని  అని నిలదీశారు. - సామాజిక మాధ్యమంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైరల్ చేయడం పసుపు చొక్కాలు ధరించే నాయకులు పని అని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp