టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై  రైల్వేకోడూరు ఎమ్మెల్యే , ప్ర‌భుత్వ విప్ కొర‌ముట్ల శ్రీ‌నివాసులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లినట్టుంది. అధికార దాహంతో, అధికార మదంతో ఢిల్లీకి వెళ్లి ఆర్టికల్ 356 అమలు చేయాలంటున్నారు. జగన్ పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ అంటూ విషాన్ని కక్కుతున్నారు.

 బద్వేల్ ఉపఎన్నిక లో బీజేపీ ని చంద్రబాబు వెనుక ఉండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు డ్రగ్స్ వాడుతున్నాడా అనే అనుమానం ఉంది. చంద్రబాబు పై నార్కో  పరీక్ష చేయాలని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.  తెలుగు దేశం పార్టీ కి త్వరలోనే ప్రజలు తగిన బుద్ది చెబుతారని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు.  కేంద్రం విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్, పోర్టు వంటి హామీలు అమలు చేస్తుంద‌ని ఆశించాం. కానీ   బీజేపీ రాష్ట్రానికి విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌దని అర్థం అయింద‌ని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: