ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తి టీడీపీ ఏజెంట్గా పని చేసాడు. ఏజెంట్గా పని చేసాడనే కక్ష్యతో వైసీపీ నేతలు నరరూప రాక్షసుల్లా మారి దారుణంగా కొట్టారని లోకేష్ ఆరోపించారు. ఈ దాడి ఘటన చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోందని లోకేష్ మండిపడ్డారు. పొలం తగాదా నెపంతో వైసీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని, రాష్ట్రంలో వైసీపీ ఫ్యాక్షన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు. ఓవైపు పోలీసులు నిద్రపోతుంటే… వైసీపీ ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయని లోకేష్ ఘాటుగా విమర్శలు చేసారు. అయితే వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైదా ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తి టీడీపీ ఏజెంట్గా పని చేసాడు. ఏజెంట్గా పని చేసాడనే కక్ష్యతో వైసీపీ నేతలు నరరూప రాక్షసుల్లా మారి దారుణంగా కొట్టారని లోకేష్ ఆరోపించారు. ఈ దాడి ఘటన చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోందని లోకేష్ మండిపడ్డారు. పొలం తగాదా నెపంతో వైసీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని, రాష్ట్రంలో వైసీపీ ఫ్యాక్షన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు. ఓవైపు పోలీసులు నిద్రపోతుంటే… వైసీపీ ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయని లోకేష్ ఘాటుగా విమర్శలు చేసారు. అయితే వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైదా ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.