అయితే సోషల్ మీడియా ద్వారా 81 రోజుల వ్యవధిలో 370 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ఇప్పటికే 364 సమస్యలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిష్కరించారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల నుంచి వచ్చిన పలు వినతులను ప్రత్యేకంగా పరిశీలించి అందులో 151 కొత్త సర్వీసులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త సర్వీసులు ఇప్పటికే 1934 ట్రిప్పులను పూర్తి చేసుకున్నాయి. తక్కువ వ్యవధిలో రవాణా సేవల పునరుద్ధరణలో ఎండీ, అధికారులు, ఉద్యోగులు చూపిన నిబద్ధతను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి ఓ ప్రకటన ద్వారా అభినందించారు. అందులో శభాష్ సజ్జనార్ అంటూ ఉద్యోగులపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే సోషల్ మీడియా ద్వారా 81 రోజుల వ్యవధిలో 370 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ఇప్పటికే 364 సమస్యలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిష్కరించారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల నుంచి వచ్చిన పలు వినతులను ప్రత్యేకంగా పరిశీలించి అందులో 151 కొత్త సర్వీసులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త సర్వీసులు ఇప్పటికే 1934 ట్రిప్పులను పూర్తి చేసుకున్నాయి. తక్కువ వ్యవధిలో రవాణా సేవల పునరుద్ధరణలో ఎండీ, అధికారులు, ఉద్యోగులు చూపిన నిబద్ధతను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి ఓ ప్రకటన ద్వారా అభినందించారు. అందులో శభాష్ సజ్జనార్ అంటూ ఉద్యోగులపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు.