ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై మ‌రొక‌సారి నిప్పుల వ‌ర్షం కురిపించారు.  సోమవారం  వ‌రి వార్‌పై కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.  కేంద్రం తన సామాజిక బాధ్యతను విస్మరించిందని అన్నారు. రైతు, పేదల వ్యతిరేక విధానాలను కేంద్రం అవలంభిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా దేశ ఆహార భద్రత కోసం బఫర్‌ స్టాక్స్‌ పెడుతుందని, రాజ్యాంగం ప్రకారం కేంద్రంపై బాధ్యత ఉందన్నారు. కోట్ల మంది బాధ్యతలను చూసే కేంద్రం చిల్లర కొట్టు యజమానిలా వ్యవహరించకూడదని హితవు పలికారు.

కేంద్రమే మెడ మీద కత్తిపెట్టి బలవంతంగా అగ్రిమెంట్ రాయించుకుంటున్న‌ది. మొన్న‌టి స‌మావేశంలో బాయిల్డ్ రైస్ కోనబోమని చెప్పిన కేంద్ర మంత్రిని రా రైస్ విషయం స్పష్టత ఇవ్వాలని చెప్పినం అని గుర్తు చేసారు. మొన్న మా మంత్రులు ఢిల్లీకి వెళ్లితే మొహం లేక మాకు అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేద‌ని వెల్ల‌డించారు. ఇంత‌టి లంగా లెక్క‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం తెర‌లేపింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కేంద్రం మాకు స‌హ‌కారమే అందించ‌డం లేద‌న్నారు. ప‌క్క రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనేక ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: