ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 60,50,650 మంది లబ్ధిదారులకు పెన్షన్ అందించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేసారు. దీనికోసం రూ.1,411.42 కోట్ల మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఖాతాల్లో జమ చేశామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. వాలంటీర్లు లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి డబ్బులు పంపిణీ చేయనున్నట్టు వివరించారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేసారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలో నూరుశాతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు. పెన్షన్ కానుక పంపిణీని డీఆర్డీఏ కాల్ సెంటర్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని మంత్రి వివరించారు.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 60,50,650 మంది లబ్ధిదారులకు పెన్షన్ అందించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేసారు. దీనికోసం రూ.1,411.42 కోట్ల మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఖాతాల్లో జమ చేశామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. వాలంటీర్లు లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి డబ్బులు పంపిణీ చేయనున్నట్టు వివరించారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేసారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలో నూరుశాతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు. పెన్షన్ కానుక పంపిణీని డీఆర్డీఏ కాల్ సెంటర్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని మంత్రి వివరించారు.