ఆర్టీసీ బ‌స్సు కారు ఢీ కొట్టు్కోవ‌డంతో ఇద్ద‌రు చిన్నారుల‌తో స‌హా ముగ్గురు మృతి చెందిన ఘ‌ట‌న ఇవాళ జ‌గిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న‌ది. జ‌గిత్యాల జిల్లా కోరుట్ల మండ‌లం మోహ‌న్‌రావు పేట వ‌ద్ద జ‌రిగిన  ఈ రోడ్డు ప్ర‌మాదంలో మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంట‌నే క్ష‌త‌గాత్రుల‌ను కోరుట్ల‌లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అంద‌జేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. కోరుట్ల లోని బిలాల్ పురా ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం హైద‌రాబాద్‌కు వెళ్లి కారులో తిరిగి కోరుట్ల‌కు వ‌స్తున్నారు.

కోరుట్ల ఇంకా 15 కిలోమీట‌ర్ల దూరం ఉంద‌న‌గానే ఆర్టీసీ బ‌స్సు- కారు ఎదురెదురుగా ఒక్క‌సారిగా ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో కారు డ్రైవ‌ర్ సాజిద్ అలీ (45)తో పాటు ఒక చిన్నారి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రొక ప‌సి బాలుడు ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గానే మార్గ‌మ‌ధ్య‌లో మృతి చెందాడు.  ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం తెలుసుకున్న కోరుట్ల పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. రోడ్డు ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: