మ‌హారాష్ట్రలో ఓమిక్రాన్ క‌ల‌క‌లం రేపుతున్న‌ది. మ‌హారాష్ట్రలో మ‌రో 7 కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌నే మ‌హారాష్ట్రలో ఒక కేసు న‌మోదు అయిన‌ది. కేవ‌లం ఒక్క‌రోజులోనే 7 కేసులు న‌మోద‌వ్వ‌డంతో మ‌హారాష్ట్ర అంతా ఉలిక్కి ప‌డుతున్నారు. దీంతో మ‌హారాష్ట్రలో వెలుగు చూసిన కేసుల సంఖ్య 8 కేసులు న‌మోదు కావ‌డంతో భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు ప్ర‌జ‌లు.

దేశ‌వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 12 కు చేరుకున్నాయి. మ‌హారాష్ట్రలో ఇవాళ 7 కేసులు న‌మోదు అవ్వ‌డంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అప్ర‌మ‌త్త‌మైన‌ది. మ‌హారాష్ట్రలో 8, క‌ర్నాట‌క‌లో 2, గుజ‌రాత్ 1, ఢిల్లీలో 1 చొప్పున కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో ఒమిక్రాన్ కేసులు 12 చేరుకోవ‌డంతో దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఒక్కసారిగా ఉలిక్కి ప‌డుతున్నారు. మ‌రోవైపు తెలంగాణ‌లో రేపో మాపో ఒమిక్రాన్ కేసులు చోటు చేసుకోనున్నాయ‌ని డీహెచ్ శ్రీ‌నివాస‌రావు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు తెలంగాణ సంభ‌విస్తే వైద్య ప‌రంగా అన్ని సిద్ధంగానే ఉన్న‌ట్టు వెల్ల‌డించారు శ్రీ‌నివాస‌రావు.


మరింత సమాచారం తెలుసుకోండి: