ప్రముఖ నటుడు, హెల్పింగ్ స్టార్ సోనూసూద్‌కు మరొక సారి షాక్ తగిలిన‌ది. గెస్ట్ హౌస్ కోసం నిర్మించిన ఆరు అంతస్తుల భవనంలో సోనూసూద్ హోటల్ నడుపుతున్నారని.. కోర్టు ఆదేశాల ప్రకారం సదరు హోటల్‌ను నివాస భవంతిగా మార్చుతానని మాట ఇచ్చిన సోనూసూద్‌ ఇంకా నిలబెట్టుకోలేదని ముంబై బృహన్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేసారు. ఈ విషయంపై సోనూసూద్ వెంటనే స్పందించాలని నోటీసుల‌లో  బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు గుర్తు చేసారు.

 మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేష్ అనే వ్యక్తి గతంలో సోనూసూద్‌పై బీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసాడు. సోనూసూద్ రెసిడెన్షియల్ బిల్డింగ్‌ను హోటల్‌గా మార్చాడని.. ఇది అక్రమం కనుక ఆ బిల్డింగ్‌ను కూల్చేయాల‌ని  ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ అంశంపై 2021  ప్రారంభంలోనే బీఎంసీ అధికారులు, సోనూసూద్ మధ్య సంప్రదింపులు జ‌రిగి.. ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఆ సమయంలో బీఎంసీ అధికారులు చెప్పినట్టు నడుచుకుంటానని తెలుపుతూ సోనూసూద్ లేఖ‌ ఇవ్వగా వివాదం సద్దుమణిగిన‌ది. అయితే ఇప్పటివరకు సోనూసూద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని బీఎంసీ అధికారులు తాజాగా నోటీసులు పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: