ఏపీ ప్రభుత్వం లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్ నోటిషికేషన్ విడుదల చేసిన విషయం విధితమే. దీనిపై పట్టాభి స్పందిస్తూ.. లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని తీసుకువచ్చిన కొత్త నిబంధన మరొక మోసం అని పేర్కొన్నారు. పేదల ఇండ్ల కోసం ఇప్పటికే 68 వేల ఎకరాలు సేకరించారని.. ఇప్పుడు లే అవుట్ల నుంచి అదనంగా 1000 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించారు పట్టాభి. ఇదివరకు సేకరించిన భూమినే పేద ప్రజలకు పంచలేదని.. కొత్తగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని మండిపడ్డారు పట్టాభి. ప్రతీ ఏటా రూ.2500 కోట్లు కొట్టేయడానికే జగన్ అండ్ కో సిద్ధమయ్యారు అని పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
ఏపీ ప్రభుత్వం లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్ నోటిషికేషన్ విడుదల చేసిన విషయం విధితమే. దీనిపై పట్టాభి స్పందిస్తూ.. లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని తీసుకువచ్చిన కొత్త నిబంధన మరొక మోసం అని పేర్కొన్నారు. పేదల ఇండ్ల కోసం ఇప్పటికే 68 వేల ఎకరాలు సేకరించారని.. ఇప్పుడు లే అవుట్ల నుంచి అదనంగా 1000 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించారు పట్టాభి. ఇదివరకు సేకరించిన భూమినే పేద ప్రజలకు పంచలేదని.. కొత్తగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని మండిపడ్డారు పట్టాభి. ప్రతీ ఏటా రూ.2500 కోట్లు కొట్టేయడానికే జగన్ అండ్ కో సిద్ధమయ్యారు అని పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.