తెలంగాణ రాష్ట్రంలోని న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రానికి గ‌వ‌ర్న‌ర్  త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ ఇవాళ రానున్నారు. న‌ల్ల‌గొండ‌లోని పాత‌బ‌స్తీలో పున‌ర్ నిర్మించిన శ్రీ భ‌క్తాంజ‌నేయ స‌హిత సంతోషిమాత ఆల‌య ప్రారంభోత్స‌వానికి ఉద‌యం 11 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ హాజ‌రు కానున్నారు. ఆ త‌రువాత అర్జాల‌బావి, అనిశెట్టి దుప్ప‌ల‌ప‌ల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను గ‌వ‌ర్న‌ర్ సంద‌ర్శించి రైతుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలుపై ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్న నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది. సీఎంఆర్ సేక‌ర‌ణ‌లో ఎఫ్‌సీఐ వైఖ‌రీని నిర‌సిస్తూ.. త్వ‌రిత‌గ‌తిన వ్యాగ‌న్ల‌ను జిల్లాకు పంపించే విధంగా చొరువ చూపాల‌ని టీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో గ‌వ‌ర్న‌ర్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేయ‌నున్న‌ట్టు స‌మాచారం. న‌ల్ల‌గొండ ప‌ర్య‌ట‌న‌కు రోడ్డు మార్గం ద్వారానే గ‌వ‌ర్న‌ర్ బ‌య‌ల్దేర‌నుండంతో.. గ‌వ‌ర్న‌ర్ వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా బందోబ‌స్తు ఇప్ప‌టికే ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: