కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వానికి అందించాల్సిన వాటిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విన‌తి ప‌త్రం అంద‌జేసారు. కేంద్ర‌మంత్రితో వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీల నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి, లోక్‌స‌భ ప‌క్ష నాయ‌కుడు మిథున్‌రెడ్డి స‌మావేశం అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు సంబంధించిన ప‌లు అంశాలు కేంద్రం నుంచి కావాల్సిన తోడ్పాటుపై ఈ సంద‌ర్భంగా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వివ‌రించారు.

ప‌లు అంశాల‌పై మెమోరండం కూడా అంద‌జేసారు ఎంపీలు. ముఖ్యంగా పోల‌వ‌రం ప్రాజెక్ట్ స‌వ‌రించిన అంచెనాల వ్య‌యానికి ఆమోదం తెల‌పాల‌ని కోరారు. ప్రాజెక్ట్ త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసే విధంగా కేంద్రం స‌హ‌క‌రించాల‌ని విన‌తి ప‌త్రంలో విజ్ఞ‌ప్తి చేసారు ఎంపీలు. అదేవిధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల సంభ‌వించిన వ‌ర‌ద‌ల వ‌ల్ల తీవ్ర న‌ష్టం జ‌రిగిన‌ద‌ని హోంమంత్రి అమిత్‌షాకు వివ‌రించారు. ఏపీకి వ‌ర‌ద సాయం చేయాల‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అమిత్‌షాను కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: