కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ రూపంలో మరొక‌సారి ప్రపంచ దేశాలను భయాందోళన గురి కు చేస్తున్న‌ది.  డెల్టా వేరియంట్‌తోనే తలమునకలైన ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఒమిక్రాన్‌ చావుదెబ్బ కొట్టే విధంగా కనిపిస్తుంది. డెల్టా వేరియంట్‌ కంటే 6 రెట్లు వేగముగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌ ఇప్పుడు 57 దేశాలకు పాకిన‌ది. దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ రోజురోజుకు వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల ప్రజలను భ‌యాందోళ‌న‌కు గురి చేయ‌డ‌మే కాకుండా.. ఆందోళనకు గురిచేస్తూనే ఉంది.  ప్రపంచ వ్యాప్తంగా  ఇప్పటికే 1,701 ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి.

యూకేలో 437, డెన్మార్క్‌లో 398, దక్షిణాఫ్రికాలో 255, యూఎస్‌లో 50, జింబాబ్వేలో 50, భారత్‌లో 23తో పాటు మరికొన్నిదేశాల‌లో ఒమిక్రాన్‌ కేసులు న‌మోదు కావ‌డం ఇప్పుడు క‌ల‌వ‌ర‌పెడుతుంది.  ఇప్పటికే ఆయా దేశాలు ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు విమాన ప్రయాణాలపై  ఆంక్షలను కూడా విధించాయి. అంతేకాకుండా కొన్ని చోట్లలో మ‌రొక‌సారి  లాక్‌డౌన్‌ను కూడా విధించారు.  కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ దిశగా   ఇప్ప‌టికే అడుగులు వేస్తున్నాయి. ఒమిక్రాన్‌ ప్రభావం భారత్‌లో కూడా  ప్రారంభ‌మైన‌ది. ఇప్పటికే భార‌త్‌లో  23 ఒమిక్రాన్ కేసులు రావడంతో కేంద్ర, రాష్ట్రాల‌ ప్రభుత్వాలు విదేశాల నుంచి భార‌త్‌కు వ‌స్తున్న ప్ర‌యాణికుల‌కు నిర్వ‌హించే క‌రోనా ప‌రీక్ష‌ల విధాన‌మును ప‌టిష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: