నంద‌మూరి నటసింహం  బాలకృష్ణ  తాజాగా నటించిన  చిత్రం “అఖండ” విజయం సాధించిన విషయం తెలిసిన‌దే. ఈ సందర్భంగా  అఖండ చిత్ర బృందం సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను ఇవాళ‌ దర్శించుకున్నారు.  హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు ‘అఖండ’ టీమ్‌ అప్పన్న సేవలో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బాలకృష్ణ మ‌రియు టీమ్  పాల్గొని సింహాద్రిశ్వరుడి ఆశీస్సులు తీసుకున్నారు.

అనంతరం బాల‌య్య  మీడియాతో మాట్లాడారు.  “అఖండ” సినిమా  అఖండ విజయం సాధించిన సంద‌ర్భంగానే విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశామ‌ని.. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియ చేసుకునేందుకు వచ్చామని  చెప్పారు.  ఈ ఏడాది తొమ్మిది నెలల త‌రువాత  విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు బాల‌కృష్ణ‌. ఇది మా విజయం మాత్రమే కాదు… చిత్ర పరిశ్రమంతా విజ‌య‌మ‌ని పేర్కొన్నారు. ఈ అఖండ సినిమాతో చలన చిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చిన‌ద‌ని.. మంచి సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఆనందం వ్యక్తం చేసారు బాల‌కృష్ణ‌. అయితే ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు వైజాగ్‌లోని ఎంజీఎం గ్రౌండ్‌లో యూడా పార్క్‌లో అఖండ విజ‌యోత్స‌వానికి ప్లాన్ చేసారు మేక‌ర్స్‌. ఇప్పటికే చిత్ర‌బృందం అక్క‌డికీ చేరుకున్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: