ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్‌పై  పెద్ద‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే   గోనె ప్ర‌కాష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ముఖ్యంగా నా బ‌యోడేటా గురించి క‌లెక్ట‌ర్ ఆరా తీసార‌ని, ఒక జ‌ర్నిలిస్ట్నుఅడిగి నా గురించి తెలుసుకున్నార‌ని పేర్కొన్నారు.   క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్ సీసీ పుటేజ్ అడిగిన‌ట్టు గుర్తు చేసారు. దాదాపు 22 మంది టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌లో ఏమి చేసార‌ని ప్ర‌శ్నించారు. 10 మంది ఎమ్మెల్యేలు, న‌లుగురు జెడ్పీచైర్మ‌న్లు, 1 ఎమ్మెల్సీ క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌లో ఒకేసారి ఎందుకు ఉంటార‌ని  మండిప‌డ్డారు. తెలంగాణ కేసీఆర్ భాష‌లో లాగు త‌డ‌వాల‌ని అంటారు.. నేను ఆమె చీర త‌డుపుతాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు గోనె ప్ర‌కాశ్‌.

డిసెంబ‌ర్ 10న స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న త‌రుణంలో ఆదిలాబాద్ నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థి పోటీ చేయ‌డంతో టీఆర్ఎస్ ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని చూస్తుంద‌ని ఆ ఆట‌లు సాగిన‌వ్వ‌మ‌ని పేర్కొన్నారు. ఆదిలాబాద్ లో ఎమ్మెల్సీగా స్వ‌తంత్ర అభ్య‌ర్థి విజ‌యం సాధించ‌డం ఖాయ‌ముగా క‌నిపిస్తొంద‌ని చెప్పారు గోనె ప్ర‌కాశ్‌. ఒక పార్టీ నేతలు మరొక‌ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయడం సాధారణమని.. కానీ ఒక  మ‌హిళా క‌లెక్టర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంట‌ని పలువురు  గోనె ప్రకాశ్‌ను తప్పుబడుతున్నారు.











మరింత సమాచారం తెలుసుకోండి: