రాజకీయాలంటే ఎప్పుడు తిట్టుకోవడమే కాదు..కాస్త క్రియేటివ్‌గానూ పని చేయాలి.. ప్రజల హృదయాలు గెలుచుకోవాలి.. ఈమధ్య కొందరు టీడీపీ నాయకులు జగన్ సర్కారు తప్పులను వెరైటీగా ఎత్తి చూపుతున్నారు. జగన్ సర్కారు అధికారంలోకి రాగానే.. అన్న క్యాంటీన్లను మూసివేయంచారు. ఇప్పుడు టీడీపీ నేతలు అక్కడక్కడా సొంత ఖర్చుతో ఈ అన్న క్యాంటీన్లు తెరుస్తున్నారు.


బొబ్బిలిలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బేబినాయన జన్మదినాన్ని పురస్కరించుకొని అన్న క్యాంటీన్ ప్రారంభించారు. బేబినాయన సొంత నిధులతో దీన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావుచేతుల మీదుగా ఈ క్యాంటీన్ ప్రారంభించారు. రోజుకు 250 మంది పేదలకు ఉచితంగా భోజనం పెట్టేందుకు నిర్ణయించారు.


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు ఎత్తివేసిందని.. క్యాంటీన్లు రద్దుతో  పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సుజయ్ అన్నారు. బేబి నాయన తన సొంత నిధులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్న సుజయ్.. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రభుత్వాలు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: