మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆస్తుల చిట్టాను బయటపెడతానంటున్నారు ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. జగదీశ్‌ రెడ్డి నేరచరిత్రను, బినామీల పేరుతో ఆయన సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తుల చిట్టాను బయటపెడతానంటున్నారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి ఒక హత్య కేసులో జైలుకు వెళ్లివచ్చిన నిందితుడని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు. ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్‌ చేసే రుజువులు తనవద్ద ఉన్నాయని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అంటున్నారు.


టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాక ముందు మంత్రిఆస్తులెన్ని? ఇప్పుడు ఎన్ని ? అని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. జగదీశ్‌ రెడ్డి శంషాబాద్‌ లో ఫాంహౌస్‌ నిర్మించుకున్నారన్న కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి..  అక్కడికి మీడియాతో కలిసి వస్తానన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే మంత్రి జగదీశ్‌ రెడ్డి తన పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విమర్శించారు. తాను కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయానంటున్న మంత్రి.. అందుకు ఆధారాలుంటే బయటపెట్టాలని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయబోనని.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: