దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చెక్బుక్లపై మరో ప్రకటన చేసింది. మార్చి 31 వరకు కొత్త చెక్బుక్లను దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పోయిన సంవత్సరం ఎస్బీఐ తన ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు, భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఆ బ్యాంకు ఖాతాదారులు కొత్త చెక్ బుక్ లు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం విలీన బ్యాంకుల కస్టమర్లు కొత్త చెక్బుక్లను దరఖాస్తు చేసుకోవడానికి 2018 మార్చి 31 వరకు సమయమిస్తున్నట్టు తెలిపింది. అప్పటి వరకు పాత చెక్బుక్లు చెల్లుతాయని చెప్పింది. 2018 మార్చి 31 అనంతరం నుంచి మాత్రం పాత చెక్ బుక్లు చెల్లవని తన అధికారిక ట్విటర్ అకౌంట్లో వెల్లడించింది.
గతేడాది ఎస్బీఐ, భారతీయ మహిళా బ్యాంక్తో సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్-జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్ను తనలో విలీనం చేసుకున్న సంగతి తెలిసందే.