చైనా దిగ్గజం షియోమి మరో సంచలనానికి వేదికయింది. ఎంఐ టీవీ 4సి పేరిట 50 ఇంచుల డిస్ప్లే సైజ్ గల సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని చైనా మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్లోనూ విడుదల కానున్న ఈ స్మార్ట్ టీవీ ఇప్పటికే ఎంఐ టీవీ సిరీస్ లో 4, 4ఏ, 4ఎస్ మోడళ్లను విడుదల చేసింది. చైనా మార్కెట్లో విడుదలైన ఈ టీవీ.. త్వరలోనే భారత్లోనూ విడుదల కానుందని ఎమ్ఐ వెల్లడించింది. ఈ టీవీ ధర రూ.22,700లని సదరు సంస్థ ప్రకటించింది.
కాగా చైనా ఇప్పుడు లాంచ్ చేసిన ఎంఐ టీవీ 4సి కేవలం రూ.22,700 లకే లభించనుంది. ఇప్పటికే ఇండియా మార్కెట్లో షియోమి టీవీలో అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. సో ఆ అమ్మకాల్లో ఇప్పుడు లాంచ్ అయిన Mi TV 4C కూడా భాగం కానుంది. కాగా 4కె టీవీలో 50 ఇంచుల డిస్ప్లే, 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
షియోమీ ఎంఐ టీవీ 4సి ఫీచర్స్ 50" డిస్ప్లే సైజ్ (4K HDR), 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 178 డిగ్రీల వీక్షణ కోణం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యుయల్ బ్యాండ్ వైఫై 802.11, బ్లూటూత్ 4.2 3 హెచ్డీఎంఐ, 1 ఏవీ, 2 యూఎస్బీ, 1 ఈథర్నెట్ పోర్టు, హెచ్డీఆర్ సపోర్ట్, డాల్బీ ఆడియో డీటీఎస్